పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం, 8 మంది దుర్మరణం

పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం, 8 మంది దుర్మరణం

పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాణసంచా కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.

Next Story