బాచుపల్లిలో స్కూటీని ఢీకొన్న స్కూల్‌ బస్సు; 8ఏళ్ల చిన్నారి మృతి

బాచుపల్లిలో స్కూటీని ఢీకొన్న స్కూల్‌ బస్సు; 8ఏళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌ బాచుపల్లి గుంతల రోడ్లు ఓ బాలికను బలిగొన్నాయి. తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తున్న 8ఏళ్ల దీక్షిత రోడ్డుపై గుంత రావడంతో బండి పైనుంచి కింద పడిపోయింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన స్కూల్‌ బస్సు చిన్నారిని ఢీకొట్టింది. దీంతో దీక్షిత అక్కడికక్కడే మృతి చెందింది. దీక్షిత బోరంపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో మూడో తరగతి చదువుతోంది. గుంతల రోడ్లు, బస్సు డ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story