98వ రోజుకు చేరుకున్న పాదయాత్ర

98వ రోజుకు చేరుకున్న పాదయాత్ర

ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ 98వ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు కే స్టార్ గోడౌన్ నుంచి నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం 3 గంటల 50 నిమిషాలకు కరివేనలో స్థానికులతో సమావేశం అవుతారు. నాలుగున్నర గంటలకు ఆత్మకూరు బహిరంగసభలో లోకేష్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత పాదయాత్రలో భాగంగా స్వచ్ఛభారత్ అంబాసిడర్లు, స్థానిక వ్యాపారులు, డ్వాక్ర మహిళలు, ముస్లీంలు, రైతులతో సమావేశం కానున్నారు. రాత్రి 9 గంటల 55 నిమిషాలకు చెంచుకాలని శివారు విడిది కేంద్రంలో నారా లోకేష్ బస చేయనున్నారు.

Next Story