
ఢిల్లీలోని ప్రశాంత్ విహార్లోని సీఆర్పీఎఫ్ స్కూల్ బౌండరీ వాల్ దగ్గర భారీ పేలుడు శబ్దం వినిపించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. పేలుడు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని కూడా సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా సమాచారం లేదు.ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. నేను ఇంట్లో ఉండగా, భారీ శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూడగా స్కూల్ సమీపంలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ఆ దృశ్యాలను తన ఫోన్లో రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. ఇంతకు మించి తనకు ఏమి తెలియదన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com