By - Bhoopathi |6 July 2023 6:45 AM GMT
రేషన్ దొంగలు ఎప్పటికప్పుడు కొత్త ట్రిక్తో రేషన్ బియ్యాన్ని యథేచ్చగా దోచేస్తున్నారు. ఈ సారి రేషన్ ఆపరేటర్ వేలిముద్రకు బదులుగా ఏకంగా ప్లాస్టిక్ వేలిముద్రతో రేషన్ బియ్యాన్ని తెలివిగా దోచుకుంటున్నారు.ఈ ఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తుబాడులో జరిగింది. ఇలా ప్లాస్టిక్ వేలి ముద్రలు ఉపయోగించి రెండు వాహనాల్లో 170 బస్తాలు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.చాలా రోజులుగా ఇలా నకిలీ వేలి ముద్రతో రేషన్ బియ్యాన్ని దోచేస్తున్న ముఠాను పట్టుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com