By - Bhoopathi |19 Jun 2023 10:30 AM GMT
సంగారెడ్డి జిల్లాలో తల్లితో పాటు ఇద్దరు కుమారులు మిస్సింగ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం తెల్లాపూర్ మున్సిపాలిటి పరిధిలో ఉన్న విద్యుత్నగర్కు గుంటూరు జిల్లాకు చెందిన యేసయ్య కుటుంబం వచ్చింది. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న యేసయ్య తన కుమారులు అభిలేష్, పృథ్వీని స్థానిక స్కూల్లో చేర్పించాడు. అయితే శనివారం స్కూల్కు వెళ్లిన కుమారులను సాయంత్రం తీసుకొచ్చేందుకు వెళ్లిన భార్య యశోద ఇంటికి రాలేదు. రాత్రైనా భార్యాపిల్లలు రాకపోవడంతో కొల్లూరు పీఎస్లో యేసయ్య ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు మిస్సైన తల్లీకుమారుల గాలింపు చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com