ఆ ఊరిలో.. మద్యం తాగితే 50వేలు జరిమానా

ఆ ఊరిలో.. మద్యం తాగితే 50వేలు జరిమానా

ఊరు చిన్నదే అయినా వారి ఆశయం మాత్రం చాలా పెద్దది. పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్న మద్యం మహమ్మారిపై సమరభేరి మోగించారు ఆ గ్రామస్తులు. ఊరిలో మద్యం సేవించినా.. విక్రయించినా 50వేల వరకు జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు సమాచారం ఇచ్చే వారికి 5వేల నజరానా ప్రకటించారు. కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లి వాసులు అమలు చేస్తున్న మద్యం ఆంక్షలు వారి జీవితాల్లో వెలుగును నింపాయంటున్నారు.ఈ చర్య వల్ల నర్సన్నపల్లి గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

Next Story