
By - Sathwik |13 Aug 2024 8:45 AM IST
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. 15 మంది ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనిపై ఇప్పటివరకూ జోగి రమేష్ స్పందించలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com