
By - Bhoopathi |8 July 2023 11:30 AM IST
ఏపీలో పలుచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీవో పాయింట్ వద్ద ఏసీబీ దాడులు చేశారు. గన్నవరంలోని లక్ష్మి కాటా దగ్గర ఆర్డీవో అధికారులు చెక్పోస్ట్ పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడకు అకస్మాత్తుగా అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్పేహిత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. అటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పురుషోత్తంపురంలోనూ ఏసీబీ రైడ్స్ జరిగాయి.టోల్ ప్లాజాలో పలు రికార్డులు ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com