Accident: మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు

Accident: మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్‌లోని బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం ఓవర్ స్పీడ్‌తో ఓ కారు మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవ్ చేస్తోన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద పోలీసులు మారణాయుధాలు గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో చనిపోయినవారిని అనురాధ, మమతగా గుర్తించారు పోలీసులు.

Next Story