
By - Bhoopathi |11 Jun 2023 1:30 PM IST
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్లో టాటా మ్యాజిక్ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 10మంది ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి నుంచి భద్రాచలం టెంపుల్కి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టీరింగ్ లాక్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇక బాధితులంతా అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com