
By - Vijayanand |17 July 2023 7:00 PM IST
అదాని పోర్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడచిన 14 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా యాజమాన్యానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది. కార్మికులకు సంఘీభావంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఈరోజు జిల్లా కలెక్టర్ ని కలిశారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పోర్ట్ ఆధానిది కావడంతో అధికార పార్టీకి చెందిన నేతలు, అధికారులు కార్మికులకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com