
By - Manikanta |25 Oct 2024 7:15 PM IST
టీవీ, డిజిటల్ మీడియాకు ఇంటర్వ్యూలతో పాపులరైన అఘోరీకి కేదార్ నాథ్ లో తృటిలో ప్రమాదం తప్పింది. కేదార్నాథ్ వెళుతుండగా అఘోరీ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోయినట్టు పలు చానెళ్లలో వార్తలు ప్రసారం అయ్యాయి. టైర్ పేలిందని కూడా చూసుకోకుండా 10 కిలోమీటర్లు అఘోరీ అలాగే వెళ్లిందని తెలిసింది. తర్వాత కారు ముందుకు వెళ్లకపోవడంతో వాహనాన్ని నిలిపివేసిందనీ.. డెహ్రాడూన్ నుండి ఓ భక్తులు కొత్త టైర్ తీసుకొచ్చి అఘోరీ వాహనానికి అమర్చాడని సమాచారం. ఈ విషయాన్ని అఘోరీ తనకు ఫోన్ చేసిన మీడియా సిబ్బందికి తెలియజేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com