By - Vijayanand |15 Aug 2023 11:35 AM GMT
ఢిల్లీ ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు.. దేశ అభివృద్ధిలో గత ప్రధానుల భాగస్వామ్యాన్ని చెరిపివేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. తమ హయం నుంచే ప్రగతి సాగుతోందన్నట్టుగా కొందరు చెప్పుకుంటున్నారని పరోక్షంగా మోదీపై ఖర్గే విమర్శలు చేశారు. దేశ నవ నిర్మాణం కోసం జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు మాజీ ప్రధానులంతా ఎంతో కృషి చేశారని ఖర్గే తెలిపారు. అయితే స్వాతంత్ర దినోత్సవం నాడే ప్రధానిని విమర్శించడం చరిత్రలో ఇదే తొలిసారి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com