ఈనెల 18న జహీరాబాద్‌లో కాంగ్రెస్ సభ

ఈనెల 18న జహీరాబాద్‌లో కాంగ్రెస్ సభ

ఈనెల 18న జహీరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ జరగనుంది. ఈనేపథ్యంలో ఇవాళ గాంధీభవన్‌లో జిల్లా నేతలతో మాట్లాడి.. నియోజకవర్గంలోని, ఏ ప్రాంతంలో సభ పెట్టాలన్నది నిర్ణయించనున్నారు. ఖర్గే సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ ప్రకటించనుంది. కాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏర్పాటైన ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ, స్ర్కీనింగ్‌ కమిటీలు గాంధీభవన్‌లో తొలి సారిగా భేటీ కానున్నాయి. ఈ భేటీలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Next Story