By - Bhoopathi |5 July 2023 1:15 AM GMT
టీమిండియా చీఫ్ సెలెక్టర్గా భారత జట్టు మాజీ ఆల్రౌండర్ అజిత్ అగార్కర్ను బీసీసీఐ ఖరారు చేసింది. అగార్కర్ను సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా బీసీసీఐ నియమించింది. సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ స్థానానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులను ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వూ చేసింది. కమిటీ సభ్యులు అజిత్ అగార్కర్ను సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఏకగ్రీవంగా సిఫార్సు చేశారు. శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉంటారని బీసీసీఐ తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com