
By - Bhoopathi |8 July 2023 10:45 AM IST
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం ఇవాల్టితో 13 వందల రోజులకు చేరింది. ఇన్ని రోజులుగా చేస్తున్నా వైసీపీ ప్రభుత్వంలో చలనం లేదంటూ అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను దేవుడికి చెప్పుకునేందుకు అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి దుర్గగుడి, మంగళగిరిలోని పానకాల స్వామి ఆలయానికి వెళ్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ మొండిగా ఉందన్న మహిళా రైతులు సీఎం జగన్ మనసు మారాలంటూ దేవుళ్లను వేడుకుంటున్నామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com