అమిత్‌షా తెలంగాణ టూర్‌ వాయిదా

అమిత్‌షా తెలంగాణ టూర్‌ వాయిదా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ టూర్‌ వాయిదా పడింది. గుజరాత్‌, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతుండటంతో ఖమ్మం సభను వాయిదా వేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. భారీ వర్షాలపై అమిత్‌షా పర్యవేక్షించాల్సి ఉన్నందున.. ఆయన సభకు రాలేకపోతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సభను వాయిదా వేశామని వెల్లడించారు. త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ప్రధాని బహిరంగ సభను కూడా ఖమ్మంలోనే నిర్వహించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.

Next Story