AMITH SHAH: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది ఎన్‌డీఏనే

AMITH SHAH: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది ఎన్‌డీఏనే

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చేది NDA సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. PTI వార్తాసంస్థతో జరిగిన ముఖాముఖిలో మాట్లాడిన అమిత్‌ షా ఏపీలో తాము దాదాపు 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా . 400కు పైగా సీట్లు సాధిస్తామన్నారు. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా, విపక్ష పార్టీల పాలనలోని.... రాష్ట్రాల్లోనూ ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని షా ధీమాగా పేర్కొన్నారు. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌లోనూ ఈ దఫా కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందని జోస్యం చెప్పారు. ఈసారి అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి -UCC తాము అమలు చేయనున్నట్లు షా చెప్పారు.UCCని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల భుజస్కంధాలపై ఉంచారని.......... షా పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్ నిర్దేశించిన మూలసూత్రాల్లో యూసీసీ కూడా ఉందని చెప్పారు. తమ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి వచ్చే ఐదేళ్లలో UCCని అమల్లోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు. సాయుధ బలగాల్లో నియామకం కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటాన్ని షా తప్పుబట్టారు. అగ్నిపథ్ కంటే ఆకర్షణీయ పథకం యువతకు ఇంకొకటి ఉండదన్నారు.

Next Story