
By - Bhoopathi |14 July 2023 3:45 PM IST
అమ్మఒడి పథకం నాలుగో విడత డబ్బు ఇప్పటికీ తల్లుల ఖాతాలో జమ కాలేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్ జూన్ 28న బటన్ నొక్కారు. 42.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6 వేల 392 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం గొప్పగా ప్రకటించారు. బటన్ నొక్కి 15 రోజులైన ఇప్పటికీ 40 శాతం మందికి నిధులు జమ కాలేదు. అమ్మఒడి సాయం 15 వేల రూపాయలల్లో పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణకు 2 వేల రూపాయలు మినహాయిస్తున్నారు. మిగతా 13 వేలైనా వస్తాయా అని ఎదురుచూస్తున్నారు లబ్ధిదారులు. డబ్బులు పడ్డాయోమోనని తల్లులు బ్యాంకులకు వెళ్లి చూసుకుంటున్నారు. డబ్బులు పడకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com