
By - Bhoopathi |9 July 2023 12:45 PM IST
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నమద్దూరులో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. కొండ ప్రాంతంలో రాళ్లు కొట్టుకునే విషయంలో ఓ వర్గం మరో వర్గంపై దాడి చేసింది. సుత్తులతో దాడి చేసుకోవడంతో రాజు, నాగరాజు అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వైసీపీ నేత లాలూ స్వామి అండతోనే తమపై దాడి చేసినట్లు చెబుతున్నారు బాధితులు. శివాలయం గుట్ట సమీపంలోని కొండ ప్రాంతంలో రాళ్లు కొట్టుకునేందుకు వడ్డే కులస్తులు ఓ సోసైటీ ఏర్పాటు చేసుకుని రాళ్లు కొట్టుకుంటున్నారు. అయితే వైసీపీ నేతల అండతో హద్దులు దాటి.. తాము ఉండే ప్రాంతంలోకి వచ్చి రాళ్లు కొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com