అపచారం.. చెప్పులు వేసుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు

అపచారం.. చెప్పులు వేసుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో ధర్మప్రచారం కార్యక్రమంలో అపచారం చోటుచేసుకుంది. ఏపీ దేవాదాయశాఖ మంత్రి చెప్పులు వేసుకొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడంతో హిందూ సంఘాలు భగ్గమంటున్నాయి. భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి ధర్మప్రచారంలో భాగంగా మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే వీరిద్దరూ చెప్పులు వేసుకొని పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ తీసుకురావడంతో పెద్ద దుమారం రేగింది. సాక్షాత్తు దేవాదాయశాఖ మంత్రి చెప్పులు వేసుకొని పట్టువస్త్రాలు తీసుకెళ్లడంతో జనం మండిపడుతున్నారు. ఇదేం ధర్మప్రచారం అంటూ నిలదీస్తున్నారు.

Next Story