అభివృద్ధి జరగలేదనే వారికి ఆదాయ పన్ను వేయాలి: బుగ్గన

అభివృద్ధి జరగలేదనే వారికి ఆదాయ పన్ను వేయాలి: బుగ్గన

కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి బుగ్గన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటూ ప్రశ్నించే వారికి ఆదాయ పన్ను వేయాలన్నారు. ఇలా పన్ను వేస్తే అలా మాట్లాడరంటూ వ్యాఖ్యానించారు. కొందరు ఊరికే రావడం మైక్ పట్టుకొని అభివృద్ధిపై మాట్లాడడం... ఇదే సరిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం ధనికం కాదని.. అయినా ఇతర రాష్ట్రాల కన్నా... పేదవాడిని చక్కగా కాపాడుకుంటున్నామని చెప్పు కొచ్చారు.

Next Story