By - Vijayanand |4 Aug 2023 12:53 PM GMT
ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించిన వాలంటీర్.. ఏకంగా బీఎల్వో చేతిలో నుంచి ఓటర్ జాబితా లాక్కున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తనకల్లు సచివాలయం-3 పరిధిలోని దుగినేపల్లి గ్రామంలో బీఎల్వో ప్రియాంకతో పాటు టీడీపీ ఏజెంట్లు ఓటరు జాబితా పరిశీలన చేపట్టారు. వాలంటీర్ బయ్యారెడ్డి తన ఓటు చూసుకోవాలంటూ బీఎల్వో చేతిలోని జాబితాను తీసుకున్నాడు. ఘటనపై తహసీల్దార్కు టీడీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు.ఆర్డీవోకు నివేదిక పంపుతామని చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com