
By - Sathwik |20 Jan 2024 8:30 AM IST
కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని చిన్న పేటకు చెందిన అంగన్వాడీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారు. అంగన్వాడి కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం 39 రోజులుగా నిరసన చేస్తున్నారు. చిన్న పేటకు చెందిన పి.శాంతికుమారి అంగన్వాడీ టీచర్..... కొత్తపేట నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే శాంతికుమారి ఛాతినొప్పితో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. ప్రభుత్వం ఉద్యోగాలు తీసివేస్తామని చెప్పటంతో... టెన్షన్ పట్టుకుని శాంతి కుమారి గుండెపోటుతో మృతి చెందిందని తోటి అంగన్వాడి కార్యకర్తలు వాపోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com