
By - Chitralekha |28 Aug 2023 12:07 PM IST
తిరుమలలో ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. నడకమార్గంలో 7వ మైలు వద్ద అర్థరాత్రి బోనులో చిక్కింది. 2 నెలల వ్యవధిలో నాలుగు చిరుతలను బంధించింది అటవీశాఖ. ఇటీవల తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన ఆడ చిరుత చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com