By - Vijayanand |14 April 2023 11:08 AM GMT
సేవా భావంతో క్రైస్తవ సంఘాలు పనిచేస్తుంటే.. బాధ్యత విస్మరించిన సీఎం దోపిడీనే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ వల్ల ఎంతగా రాష్ట్రం దెబ్బతిందో క్రైస్తవ సంఘాలు ఆలోచన చేయాలన్నారు. సేవా భావంతో విశాఖలో గీతం యూనివర్సిటీ నెలకొల్పితే దానిపైనా విధ్వంసానికి దిగారని మండిపడ్డారు. చేయూతనివ్వాల్సిన సేవా సంస్థల పట్ల ఈ సీఎం సాయం చేయకపోగా.. దాడులు చేస్తున్న వ్యవహారంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. పాస్టర్లకు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com