By - Bhoopathi |15 July 2023 5:15 AM GMT
ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు, సేవలు పొందాలంటే లబ్దిదారులు తమ ఆధార్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రజల వ్యక్తిగత సమాచారంతో కూడిన ఆధార్కు గోప్యత అవసరమని,దానిని నిర్బంధం చేయకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే రూలింగ్ ఇచ్చింది.ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు,రాయితీలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బట్వాడా చేయడంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆధార్ నంబరు ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం 2016లో బిల్లును ఆమోదించిందని దానిని ఇప్పటికే దేశంలోని 16రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని అధికారులన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com