
By - Vijayanand |8 Aug 2023 5:31 PM IST
హిందూధర్మం అనుసరించేవాళ్లనే టీటీడీ చైర్మన్గా నియమించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. హిందూధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లైతేనే టీటీడీ చైర్మన్ పదవికి న్యాయం చేస్తారని చెప్పారు. గతంలో ప్రభుత్వం 80 మందితో ధర్మకర్తల మండలిని నియమించిందని.....దీనిపై విమర్శలు రావడంతో 52 మంది నియామకాలను నిలిపివేసిందన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ పదవులను ప్రభుత్వం రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తుందని పురందేశ్వరి ఆరోపించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com