కేంద్రం రూ.8,600 కోట్లకు పైగా నిధులు ఇచ్చింది: పురందేశ్వరి

కేంద్రం రూ.8,600 కోట్లకు పైగా నిధులు ఇచ్చింది: పురందేశ్వరి


వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్పంచ్‌లను జగన్ సర్కారు ఉత్సవ విగ్రహంలా మార్చిందని ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తోందని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో గ్రామ పంచాయతీలకు కేంద్రం 8 వేల 600 కోట్లకు పైగా నిధులు ఇచ్చిందన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక ఎంతో మంది సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 10న సర్పంచ్‌లకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపడుతుందని పురందేశ్వరి అన్నారు.

Next Story