
By - Vijayanand |16 July 2023 9:45 AM IST
అమరావతిలో ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం జరనగుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఏపీలో పార్టీ బలోపేతం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పథకాలను ప్రజల్లో తీసుకెళ్లే అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీ ధరన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవదర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్కుమార్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సోమువీర్రాజు హాజరవుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com