By - Bhoopathi |17 July 2023 5:30 AM GMT
ఇటీవలే ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. అందుకే విస్తృతస్థాయిలో జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.ఈ నెల 23న ప్రొద్దుటూరులో రాయలసీమ నేతలతో పురందేశ్వరి సమావేశం కానున్నారు. 25న గుంటూరులో కోస్తా జిల్లాల నేతలతో భేటీ కానున్నారు. ఇక 26న రాజమండ్రిలో గోదావరి జిల్లాల నేతలను కలుసుకోనున్నారు.ఈ నెల 27న విశాఖలో ఉత్తరాంధ్ర నేతలతో పురందేశ్వరి సమావేశం జరపనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ శ్రేణులను ఇప్పటినుంచే సమాయత్తం చేయాలని పురందేశ్వరి భావిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com