Dokka seethamma : లోకేష్ చొరవతో డొక్కా సీతమ్మ భోజనంలో సన్న బియ్యం

Dokka seethamma : లోకేష్ చొరవతో డొక్కా సీతమ్మ భోజనంలో సన్న బియ్యం

పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను మరింతగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు సన్న బియ్యం (ఫైన్ రైస్) అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది.

పోషక విలువలు అధికంగా ఉండే సన్న బియ్యం పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మద్దతు తెలిపారు. కావలసిన పోషక విలువలతో కూడిన సన్న బియ్యం తమ శాఖ వద్ద అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు.

Next Story