
కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దని... దానిని వీడాలని సీఎం చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు మీడియాతో సరదాగా సంభాషించారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు తాను కూడా దండం పెడతానని చంద్రబాబు అన్నారు. ఇవాళ్టి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్స్టాప్ పెడుతున్నా అని చంద్రబాబు తెలిపారు. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని... నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నా అని సీఎం చంద్రబాబు తెలిపారు. అనంతరం ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com