By - Vijayanand |10 Aug 2023 10:45 AM GMT
వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని ఏపీ విద్యుత్తు ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ రంగంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆగస్టు 17వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్ట్రగుల్ కమిటీ నాయకులు హెచ్చరించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com