ఆంధ్రప్రదేశ్లో పోలీసుల అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అక్రమంగా నిర్బంధించడం మానవహక్కుల ఉల్లంఘనే అని స్పష్టం చేసింది. వేదాయపాలెం పోలీసుల అక్రమ నిర్బంధంపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం సీఐ, ఎస్ ఐలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడు జైల్లో ఉన్నప్పటి ఫొటోతో నిందితుడి భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అక్టోబర్ 25న తన భర్తను తీసుకెళ్లి నవంబర్ 8న కేసు నమోదు చేశారని నిందితుడి భార్య ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మోసం కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని రోజులపాటు ఎందుకు నిర్బంధించారని.. హైకోర్టుప్రశ్నించింది. భార్యాపిల్లలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలకు తగిన వేదికకు వెళ్లేందుకు.... పిటిషనర్ కు ధర్మాసనం వెసులుబాటు కల్పించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com