పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ

పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ

పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 800 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ,చీఫ్ ఇంజనీర్లను వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి హాజరయ్యారు. పెద్దఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతున్నా కూడా సంబంధింత అధికారులు పట్టించుకోవడం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది పాలేటి మహేష్ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

Next Story