
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారని.. బెయిల్పై విచారణ జరుగుతున్న సందర్భంలో కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని లూథ్రా వాదించారు. ఈ కేసుకు సంబంధించి 2018 నుంచి విచారణ జరుగుతుంటే.. ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని వాదించారు. సీమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్ అంతా వెరిఫై చేయలేదని రాశారని.. ఈ ఫోరెన్సిక్ రిపోర్టు చంద్రబాబును ఇరికించడం కోసమే తయారు చేశారని లూథ్రా బలంగా వాదనలు వినిపించారు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేయలేదని ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన వారే రిపోర్టులో చెప్పారని లూథ్రా వాదించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com