
By - Chitralekha |28 July 2023 1:23 PM IST
హన్మకొండ 56వ డివిజన్ జవహర్ కాలనీ ప్రాంతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటించారు. వరద ప్రవాహానికి కోతకు గురైన రోడ్లను పరిశీలించారు. వరద బాధితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందుతాయని మంత్రి భరోసా ఇచ్చారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com