LOKESH: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేశ్‌

LOKESH: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేశ్‌

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్.. పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కిలో మీటర్ల దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మొదటి వంద కిలోమీటర్లు మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీలో తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో గ్రామంలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని లోకేష్ శిలాఫలకంలో పొందుపరిచి ఆవిష్కరించారు. మంత్రి హోదాలో ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ప్రభుత్వ ఆస్పపత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కావాల్సిన యంత్రాలు, పడకలు, ప్రత్యేకమైన నీటి శుద్ధి పరికరాలను కేంద్రంలో ఏర్పాటు చేశారు. గతంలో బంగారుపాళ్యంతో పాటు అరగొండ, ఐరాల తదితర ప్రాంతాలకు చెందిన 72 మంది డయాలసిస్‌ రోగులు ప్రస్తుతం చిత్తూరుకు వెళ్లి డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ బాధలు తొలగిపోనున్నాయి.

Next Story