
By - Bhoopathi |13 July 2023 11:30 AM IST
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీరుపై టీడీపీ యువనేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఉదయగిరిలోని 3వేల ఎకరాలపై సజ్జల కన్ను పడిందని ఆరోపించారు. వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములన్నీ లాక్కుంటామని వారు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తామని స్పష్టం చేశారు. 45 ఏళ్లు దాటిన పేద మహిళలకు పింఛను ఇస్తానని చెప్పి జగన్ మోసం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుతో పిల్లలందరికీ ఆర్థిక సాయం చేస్తామన్నారు అంగన్వాడీ కార్యకర్తల అన్ని డిమాండ్లు నెరవేరుస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com