
By - Sathwik |3 Dec 2023 12:00 PM IST
తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. అధికారం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మొదటి విజయం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 20వేలకు పైగా ఆధిక్యంతో ఆదినారాయణ జయకేతనం ఎగురవేశారు. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు అక్కడ విజయం సాధించారు. అనంతరం మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ విజయం సాధించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com