
By - Bhoopathi |13 July 2023 1:30 PM IST
ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తలపెట్టిన అతి రుద్ర మహాయాగంలో అపశృతి చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూర్లోని నివాసంలో యాగం నిర్వహిస్తుండగా చివరి రోజు పూర్ణ ఆహుతిలో మంటలు ఎగసి పడ్డాయి. ఈ ఘటనలో టెంట్స్, హోమం గుండాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అయితే ప్రాణనష్టం, ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మీడియాను ఎమ్మెల్యే అనుచరులు అనుమతించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com