హైదరాబాద్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా

హైదరాబాద్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా

హైదరాబాద్‌లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఓ ఆటో బోల్తా పడింది. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వస్తున్న ఆటో అకస్మాత్తుగా పల్టీ కొట్టింది. డ్రైవర్ సెల్‌ఫోన్‌ చూస్తూ ఆటో నడుపుతూ.. ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని గమనించలేదు. దీంతో ద్విచక్ర వాహనానికి సమీపించగానే ఢీ కొడుతుందనే భయంతో ఆటోను కుడివైపుకు తిప్పాడు. దీంతో అదుపు తప్పిన ఆటో పల్టీ కొట్టింది. ఈ నెల 22న జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Next Story