
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. దెబ్బకు దెబ్బ, కోతకు కోత ఉంటుందని హెచ్చరించారు. కేసులకు, కోర్టులు, జైలు శిక్షకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అవినీతి చేయని వాడు దేవుడికి కూడా భయపడడని... సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నాన్న నందమూరి తారక రామారావు చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసిస్తామని బాలకృష్ణ అన్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో బాలకృష్ణ పాల్గొన్నారు. వైకాపా అక్రమ కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా.... చంద్రబాబును అరెస్టు చేశారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని బాలకృష్ణ మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో స్పందన చూసి ఓర్వలేకపోయారని, అందుకోసమే చంద్రబాబుపై స్కిల్ కేసులో.. రాజకీయ కక్షతోనే పెట్టారని బాలకృష్ణ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com