
By - Sathwik |14 Sept 2023 10:00 AM IST
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమండ్రి చేరుకున్నారు. సోదరి భువనేశ్వరి, కూతురు బ్రహ్మణితో ఆయన సమావేశమై వారిని పరామర్శించారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు బాధాకరమని బాలకృష్ణ విచారం వ్యక్తంచేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తోనూ బాలకృష్ణ భేటీ కానున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ముగ్గురి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ముగ్గురు చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపైనా నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com