By - Vijayanand |4 Aug 2023 8:03 AM GMT
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత సంజయ్ని బీజేపీలో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మోదీ రాజ్యం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. కీలక బాధ్యతలు అప్పగించిన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com