
By - Bhoopathi |26 Jun 2023 5:00 PM IST
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యపేట జిల్లాలో కొనసాగుతోంది. చివ్వేంల మండలం కొండలరాయుని గూడెం, మున్యూ నాయక్ తండాల మీదుగా సాగింది. మహిళలు భట్టికి ఎదురెళ్లి మరీ హారతులిచ్చారు. సంప్రదాయ రీతితో స్వాగతం పలికారు గిరిజనులు గిరిజనులతో మమేకమైన భట్టి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయనకు తలపాగ చుట్టి జొన్న రొట్టెలు తినిపించారు తండావాసులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందన్నారు భట్టి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com