By - Vijayanand |29 Aug 2023 7:56 AM GMT
ఎకో వైజాగ్ క్యాంపెయిన్లో భాగంగా విశాఖలో జీవీఎంసీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధర్యంలో బీచ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని హాజరయ్యారు. ఎకో వైజాగ్ బీచ్ వాక్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. గతంలో కంటే వైజాగ్లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. తాను ఇప్పటి వరకు కుటుంబసభ్యులతో కలిసి ఐదు వేల మొక్కలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పర్యవరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రోజర్ బిన్ని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com