
By - Vijayanand |12 Aug 2023 1:59 PM IST
కరీంనగర్లో ఎలుగు బంటి హల్చల్ చేసింది. శివారు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి నడిరోడ్డుపై ప్రత్యక్షం కావడంతో శ్రీపురం, రజ్వీ చమన్ వాసులు అప్రమత్తమయ్యారు. అటవీఅధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో స్థానిక యువత కర్రలు పట్టుకుని గస్తీ చేపట్టారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఎలుగుబంటి వెళ్లిపోవడతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఉదయం రేకుర్తిలోని పలు కాలనీల్లోనూ ఎలుగుబంటి సంచరించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎలుగు బంటికి మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com